తెలంగాణలో ఫిబ్రవరి 1నుండి విద్యాసంస్దలు పున: ప్రారంభం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి దృష్టిలో పెట్టుకుని ఈనెల 31తేదీవరకూ విద్యాసంస్దలు కు సెలవు ప్రకటించారు.అయితే కరోనా వ్యాప్తి తీవ్రంగా వున్నప్పటికీ ఫిబ్రవరి 1తేదీనుండి పాఠశాలలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.కరోనా నిబందనలు కఠినతరం చేస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.ఇప్పటికే వివిద రాష్ట్రాలలో కోవిడ్ నిబందనలు పాటిస్తూ పాఠశాలలు పనిచేస్తున్నాయి.