రాష్ట్రప్రభుత్వం రైతులుకు ఎంతో మేలు చేసే ప్రభుత్వమని ,రైతుల పక్షపాతి ప్రభుత్వంగా వైయస్ జగన్మోన్రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర రెవెన్యూశాఖామంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు.శుక్రువారం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని కోడిరామ్మూర్తి స్టేడియంలో వైయస్సాఆర్ యంత్రసేవ కార్యక్రమలో ఆయన పాల్గోన్నారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ రైతులకు అనుగుణంగావ్యవసాయ యంత్ర సామగ్రి ని అందించేందు రాష్ట్రప్రభుత్వం ఈ మోగా కార్యక్రమాన్ని ఏర్పాటుచేసిందని రైతులు కు ట్రాక్టర్లు,కోత మిషన్లు అందించడం జరిగిందని అన్నారు.
నాడు చంద్రబాబు నాయు రైతులుకు ఉచిత విద్యుత్ ఇవ్వలేమని చేతులెత్తేస్తే అప్పటి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్రెడ్డి ఉచిత విద్యుత్ ఇవ్వడం జరిగిందని దాన్ని వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కొనసాగిస్తుందని అన్నారు.రైతులు కోసం నిరంతరం ఆలోచించే వ్యక్తి మన ముఖ్యమంత్రి ని రాబోయే ఎన్నికలలో మళ్లీ జగన్మోన్రెడ్డిని ముఖ్యమంత్రి ని చేయాలని రైతులు పూర్తి సహకారం అందించాలని అన్నారు.
ఈ సందర్బంగా రైతులకు ట్రాక్టర్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి స్పీకరు తమ్మినేని శీతారాం,ధర్మాన క్రిష్ణదాసు,రెడ్డి శాంతి తదితరులు పాల్గోన్నారు.