వాతావరణ సమాచారం
అమరావతి: హిందూ మహాసముద్రంలో నుండి బంగాళాఖాతం వైపు బలంగా రుతుపవనాలు గాలలు వీస్తున్నాయి.దీని ప్రభావంతో రానున్న 48గంటలలో దక్షిణ అండమాన్ సముద్రం దాని పరిసరాలలో నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.ఉత్తర కోస్తా ప్రాంతాలలో సముద్రమట్టానికి 1.5కిలోమీటర్లు నుండి 5.8కిలోమీటర్లు వరకూ ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది.కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురస్తాయని రానున్న 24గంటలలో రాయలసీమ,కోస్తాలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.